ఏది ప్రైవేట్.. ఏది పబ్లిక్
ప్రయోజనాలు
* 2008, 2009 సంక్షోభ సమయంలో చాలామటుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మూతపడ్డాయి. ఆ సమయంలో వ్యక్తిగత ఆస్తులు కోల్పోకుండా ఈ తరహా కంపెనీల యాజమాన్యాలు బయటపడ్డాయి. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. కంపెనీ నష్టాల్లోపడ్డపుడు కంపెనీ షేర్లను విక్రయించి అప్పులను తీర్చాలి. వ్యక్తిగత ఆస్తులకు ముప్పు ఉండదు. * షేర్ల బదిలీ లేదా విక్రయంపై కొంత పరిమితులుంటాయి. దీనిని ప్రయోజనంగా చూడవచ్చు. ప్రతికూలంగానూ చూసుకోవచ్చు. కొంతమంది వాటాదార్లకు ఇది ప్రయోజనం ఎలాగంటే.. షేర్లను విక్రయించాలంటే.. బయటి వారికి విక్రయించకూడదు. అంటే తెలిసిన వ్యక్తులు/బంధువులే కంపెనీలో ఉంటారు కాబట్టి వారికే విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే మిగతా వాటాదార్లు కూడా అంగీకరించాలి. ఇక ప్రతికూలం ఎలాగంటే.. ఏదైనా అవసరం ఉండి షేర్లను విక్రయించుకునే వారికి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. * కేవలం ఇద్దరు సభ్యుల(గరిష్ఠంగా 200)తోనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించొచ్చు. మూలధనం కూడా కనీసం రూ.లక్ష ఉంటే చాలు. * ఒకవేళ యజమాని చనిపోయినా.. వ్యాపారాన్ని వదిలి వెళ్లినా.. దివాలా ప్రకటించినా ఆ కంపెనీ కొనసాగుతుంది. ఆయన షేర్లను మరొక వ్యక్తికి బదిలీ చేసి కంపెనీని నడపవచ్చు. పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. పూర్తి వివరాలతో ఆర్థిక ఫలితాలను ప్రకటించనక్కర్లేదు. ఎందుకంటే పబ్లిక్(ప్రజలకు)కు ఇక్కడ షేర్లు ఉండవు కాబట్టి. * వాటాదార్లు అంగీకరిస్తే తప్ప షేర్లను బదిలీ చేసుకోలేకపోవడమే ప్రతికూలత. |
ప్రయోజనాలు
* కనీసం ఏడుగురు సభ్యుల(గరిష్ఠం అపరిమితం)తోనే దీనిని ప్రారంభించవచ్చు. పబ్లిక్ లిమిటెడ్లో లయబులిటీ(బాధ్యత) పరిమితంగా ఉంటుంది. చెల్లింపులకు ఏ ఒక్క వాటాదారో బాధ్యత వహించరు. ఇదో ప్రత్యేక చట్టబద్ధ కంపెనీ కాబట్టి ప్రతీ వాటాదారు కూడా అందులో భాగస్వామే. ఆ విధంగా చూస్తే వాటాదార్లకు బాధ్యత, నష్టభయం తక్కువన్నమాట. * పారదర్శకత ఉంటుంది. ఎలాగంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఆర్థిక ఫలితాలను బయటకు వెల్లడించాల్సి ఉంటుంది. తద్వారా వాటాదార్లు తమ కంపెనీ పనితీరుపై అంచనాకు రావొచ్చు. * కంపెనీ తన అవసరాలను బట్టి స్టాక్ మార్కెట్లో షేర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమీకరించుకోవచ్చు. బాండ్లు, డిబెంచర్లనూ జారీ చేసి నిధులను అందిపుచ్చుకోవచ్చు.
ప్రతికూలతలు
* ప్రజల ముందుకు వెళ్లడమనేది వ్యయంతో కూడుకున్న, సమయం ఎక్కువ పట్టే ప్రక్రియ. సెబీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహారాలను నడపాల్సి ఉంటుంది. ఇందు కోసం అకౌంటెంట్లు, అండర్రైటర్ల వంటి వారిని కంపెనీ నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ సారి నిధుల సమీకరణ కష్టం. * ఒక్కసారి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ అయితే కంపెనీ యజమాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేడు. మెజారిటీ వాటాదారు తానే అయినప్పటికీ.. మైనారిటీ వాటాదార్ల సమ్మతినీ పొందాల్సిందే. |